తెలంగాణ

telangana

ETV Bharat / state

'దుబ్బాక ఎన్నికల ఫలితాన్ని మరోసారి చూపించండి' - warangal latest news

దుబ్బాక ఎన్నికల ఫలితాన్ని మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపించాలని ఎమ్మెల్యే రఘునందన్‌ రావు కోరారు. ఓరుగల్లు పట్టభద్రులు ఇచ్చే తీర్పు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌ హౌస్ నుంచి సెక్రటేరియట్‌కు వచ్చేలా ఉండాలని అన్నారు. కోటి మొక్కల పేరుతో కోట్ల రూపాయాల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

dubbaka mla raghunaandan rao on warangal about mlc election campaign
'దుబ్బాక ఎన్నికల ఫలితాన్ని మరోసారి చూపించండి'

By

Published : Feb 17, 2021, 6:24 AM IST

ఓరుగల్లు పట్టభద్రులు ఇచ్చే తీర్పు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌ హౌస్ నుంచి సెక్రటేరియట్‌కు వచ్చేలా ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు అన్నారు. వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్‌లో ఓరుగల్లు సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో 'ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టుభద్రుల పాత్ర' అనే ఆంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో పాటు, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డి హజరయ్యారు.

రూ. కోట్లు వృధా..

దుబ్బాక ఎన్నికల ఫలితాన్ని మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపించి విజయం అందించాలని పట్టభద్రులను రఘనందన్ రావు కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజున కోటి మొక్కల పేరుతో రూ. కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. జూన్​లో పెట్టాల్సిన మొక్కలను ఇప్పుడు పెడుతున్నారని విమర్శించారు.

ఆ డబ్బులను కరోనా సమయంలో ఉపాధి లేక ఇబ్బందులు పడ్డ ప్రైవేటు అధ్యాపకులకు ఇస్తే బాగుండేదని అన్నారు. నియంత పోకడలతో వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తగిన గుణపాఠం చెప్పాలని.. భాజాపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి పట్టభద్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి:స్కోచ్: ''సీఎం ఆఫ్‌ ది ఇయర్‌''గా జగన్‌

ABOUT THE AUTHOR

...view details