వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని పున్నమి గెస్ట్హౌస్లో పోలీసుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని సీపీ తరుణ్ జోషి ప్రారంభించారు. పాజిటివ్ వచ్చిన పోలీసులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఈ కేంద్రంలో చికిత్స పొందొచ్చని సీపీ సూచించారు.
పోలీసుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన సీపీ - పోలీసుల కోసం ఐసోలేషన్ కేంద్రం ప్రారంభం
కొవిడ్ బారిన పడిన సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యలు కూడా పూర్తి ఆరోగ్యవంతులయ్యేందుకు సహకారం అందిస్తామని వరంగల్ సీపీ అన్నారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన పోలీసుల సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యుల కోసం కాజీపేటలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
![పోలీసుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన సీపీ కొవిడ్ ఐసోలేషన్ కేంద్రం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-05:50:52:1620822052-11733101-wgl.jpg)
తెలంగాణ వార్తలు
ఈ కేంద్రంలో 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉంటారని వెల్లడించారు. అంబులెన్స్, భోజన, తాగునీటి వసతి కల్పించినట్లు సీపీ తెలిపారు. అత్యవసర పరిస్థితి ఉన్న వారికి ఆక్సిజన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప, స్పెషల్ బ్రాంచ్ అదనపు డీసీపీ జనార్దన్, డిప్యూటీ డీఎంహెచ్వో యాకుబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దు'