తెలంగాణ

telangana

By

Published : Mar 21, 2020, 5:16 PM IST

ETV Bharat / state

రాజధాని ఎక్స్​ప్రెస్​లో కరోనా కలకలం

వరంగల్​ అర్బన్ జిల్లా కాజీపేట రైల్వేస్టేషన్​లో కరోనా కలకలం రేపింది. రాజధాని ఎక్స్​ప్రెస్​లో వైరస్​ అనుమానిత జంట ప్రయాణించటం వల్ల రైలును గంటా ఇరవై నిమిషాల పాటు నిలిపివేశారు. ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు.

Corona victims on a RAJADHANI  express train in Waranagal
రాజధాని ఎక్స్​ప్రెస్​లో కరోనా కలకలం

బెంగుళూరు నుంచి నిజాముద్దీన్ వెళ్లే రాజధాని ఎక్స్​ప్రెస్​ను కాజీపేట రైల్వేస్టేషన్​లో గంటా ఇరవై నిమిషాలపాటు నిలిపేశారు. కరోనా వైరస్ అనుమానిత జంట అందులో ప్రయాణిస్తున్నారంటూ ప్రయాణీకులు అధికారులకు సమాచారం అందించారు. ఉన్నాతాధికారుల సూచన మేరకు వారిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు.

రాజధాని ఎక్స్​ప్రెస్​లో కరోనా కలకలం

దంపతులు విహారయాత్ర నిమిత్తం బాలికి వెళ్లి ఇటీవలే తిరిగి రాగా....శంషాబాద్ విమానాశ్రయంలో హోం క్వారెంటైన్​లో ఉండాలని అధికారులు సూచించారు. కానీ వారు బేఖాతరు చేసి స్వస్థలమైన ఉత్తరప్రదేశ్​కు రైలులో బయలుదేరివెళ్తున్నట్లు పేర్కొన్నారు. దంపతులను ఎంజీఎంకు తరలించి అనంతరం...కోచ్ మొత్తం శానిటైజ్​ చేసి అందులోని ప్రయాణీకులకు వేరే కోచ్​లోకి మార్చిన అనంతరం రైలును పంపించారు.

ఇదీ చూడండి:కరోనా వైరస్​పై పోరుకు భారత్​ సరికొత్త వ్యూహం

ABOUT THE AUTHOR

...view details