తెలంగాణ

telangana

ETV Bharat / state

Corona Vaccine: ‘యాచకులకు త్వరలోనే కరోనా టీకాలు’ - వరంగల్​ సీపీ తాజా వార్తలు

హన్మకొండలో పోలీసులు, వైద్యశాఖ ఆధ్వర్యంలో యాచకులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారికి వైరస్​పై​ అవగాహన కల్పించి మాస్కులు అందజేశారు. త్వరలోనే టీకాలు వేయిస్తామని సీపీ తరుణ్​ జోషి తెలిపారు.

corona tests conducted to beggars in hanmakonda by police and health departments
‘యాచకులకు త్వరలోనే కరోనా టీకాలు’

By

Published : Jun 8, 2021, 5:51 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాచకులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. జిల్లా వైద్య విభాగం సహకారంతో సుమారు 200 మంది యాచకులు, వారి కుటుంబసభ్యులకు టెస్టులు చేశారు. వైరస్​ను నియంత్రించడంలో అందరికి బాధ్యత ఉందని పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. యాచకులకు కరోనా పరీక్షలపై అవగాహన లేదని.. ఇది దృష్టిలో ఉంచుకొని వైద్యశాఖతో కలిసి నగరంలోని యాచకులకు టెస్టులు నిర్వహించామని తెలిపారు.

యాచకులతో కొవిడ్​ విస్తరించే ప్రమాదం ఉందన్న సీపీ, వారికి వైరస్​పై అవగాహనతో పాటు మాస్కులు అందిస్తున్నామని వెల్లడించారు. పాజిటివ్​ వచ్చిన వారిని ఐసోలేషన్​ కేంద్రాలకు తరలిస్తామని చెప్పారు. పోలీసుల ఆధ్వర్యంలో త్వరలోనే యాచకులకు టీకాలు వేయిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:PRC: ఉద్యోగులకు గుడ్​న్యూస్​... అమల్లోకి రానున్న పీఆర్‌సీ!!

ABOUT THE AUTHOR

...view details