తెలంగాణ

telangana

By

Published : Apr 30, 2021, 2:09 PM IST

ETV Bharat / state

కళతప్పిన ఓటింగ్ కేంద్రాలు.. అభ్యర్థుల గుండెల్లో గుబేలు

కరోనా ప్రభావం గ్రేటర్ వరంగల్ ఎన్నికల పోలింగ్​పై పడింది. ఓటర్లు లేక పోలింగ్ కేంద్రాలు వెలవెలబోయాయి. మధ్యాహ్నం 12 గంటలు గడిచినా.. కొన్ని కేంద్రాల్లో 23 శాతం ఓటింగ్ నమోదు కాకపోవడం వల్ల అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.

greater warangal election, greater warangal election 2021, less polling in greater warangal election, telangana news
గ్రేటర్ వరంగల్ ఎన్నికలు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలు, వరంగల్​ మున్సిపల్ ఎన్నికలు

వరంగల్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్​లో ఓటర్లు లేక పోలింగ్ కేంద్రాలు వెలవెలబోయాయి. మధ్యాహ్నం 12 గంటలు గడిచినా.. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు రాలేదు. ఓటింగ్ ప్రారంభం నుంచి మందకొడిగానే సాగుతోంది. ఓవైపు మండే ఎండలు.. మరోవైపు కరోనా భయంతో ఓటు వేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు.

మధ్యాహ్నం 12 గంటల వరకు 31.06 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరికొన్ని వార్డుల్లో 23 శాతానికి మించకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. తెలిసిన వారిని ఇంటికి వెళ్లి మరీ ఓటు వేయాలని అభ్యర్థులు వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details