తెలంగాణ

telangana

ETV Bharat / state

'మహిళల రక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం' - వరంగల్​లో కాంగ్రెస్​ నేతలు సత్యాగ్రహ దీక్ష

దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ వరంగల్ నగరంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అధిష్ఠానం పిలుపుతో రుద్రమదేవి కూడలి వద్ద ఆ పార్టీ శ్రేణులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.

congress leaders protest at rudramadevi junction in warangal
'మహిళల రక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి'

By

Published : Oct 5, 2020, 3:11 PM IST

వరంగల్​లోని రుద్రమదేవి కూడలి వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టాయి. ఈ దీక్షలో అర్బన్ జిల్లా, గ్రామీణ జిల్లాకు చెందిన నేతలు పాల్గొన్నారు. దేశంలో మహిళలపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయని వాటిని నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని వారు ఆరోపించారు.

మహిళలపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన శిక్షలు అమలు చేయకపోవడం వల్లే తరచుగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని మండిపడ్డారు. మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన నిర్భయ చట్టం క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని విమర్శించారు.

ఇదీ చదవండి:శాంతి భద్రతలపై ఈ నెల 7న సీఎం కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details