వరంగల్ అర్బన్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న అన్ని రైతు వేదికలను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను జిల్లా పాలనాధికారి రాజీవ్గాంధీ హనుమంతు ఆదేశించారు. హన్మకొండలోని కలెక్టర్ ఛాంబర్లో పంచాయతీ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
రైతు వేదికల నిర్మాణాలు వారం రోజుల్లో పూర్తి చేయాలి : కలెక్టర్
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణాలు త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులను వరంగల్ అర్బన్ జిల్లా పాలనాధికారి రాజీవ్గాంధీ హనుమంతు ఆదేశించారు. చివరిదశలో ఉన్న నిర్మాణాలు వారం రోజుల్లోపు పూర్తి కావాలన్నారు.
![రైతు వేదికల నిర్మాణాలు వారం రోజుల్లో పూర్తి చేయాలి : కలెక్టర్ Collector gives order Complete all pending farmers venues all in warangal urban district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9564086-747-9564086-1605546506825.jpg)
రైతు వేదికల నిర్మాణాలు వారం రోజుల్లో పూర్తి చేయాలి : కలెక్టర్
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణాల పనుల్లో నిర్లక్ష్యం పనికి రాదన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 30 వేదికల పనులు పూర్తి కాగా... మరో పది చివరిదశలో ఉన్నాయని తెలిపారు. పెండింగ్లో ఉన్న బిల్లులను త్వరగా చెల్లించి నిర్మాణాలు వెంటనే పూర్తి కలెక్టర్ సూచించారు.