వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని హన్మకొండలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.
హన్మకొండలో జెండా ఆవిష్కరించిన చీఫ్ విప్ వినయ్భాస్కర్ - chief whip vinay bhaskar in republic day celebrations
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా సాగాయి. హన్మకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
![హన్మకొండలో జెండా ఆవిష్కరించిన చీఫ్ విప్ వినయ్భాస్కర్ chief whip vinay bhaskar in republic day celebrations at hanamkonda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10385790-1054-10385790-1611646242435.jpg)
హన్మకొండలో గణతంత్ర వేడుకలు
క్యాంపు ఆఫీసులో వినయ్ భాస్కర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేశారు.
- ఇదీ చూడండి :ప్రగతి భవన్లో జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్