తెలంగాణ

telangana

By

Published : Aug 24, 2020, 7:34 AM IST

ETV Bharat / state

దుప్పట్లు పంపిణీ చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్‌!

ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలో అనేక మంది ఇబ్బందులకు గురయ్యారని, సీఎం, కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ సకాలంలో స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్​ భాస్కర్​ అన్నారు. ఆదివారం ఆయన గ్రేటర్​ వరంగల్​లోని 32వ డివిజన్​లో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.

Chief VIP Dasyam Vinay Bhaskar Distributes Bedsheets in greater Warangal
దుప్పట్లు పంపిణీ చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్‌!

వరంగల్​ పట్టణ జిల్లా గ్రేటర్​ వరంగల్​ పరిధిలోని 32వ డివిజన్​ తీగల గుట్ట రైల్వే గేట్​ ప్రాంతంలో తెరాస ఎన్నారై సెల్ సౌతాఫ్రికా విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మల్యే దాస్యం వినయ్​ భాస్కర్​ పేదలకు దుప్పట్లు పంచారు. ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలో చాలామంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని.. సకాలంలో స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ సకాలంలో స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారని ఆయన అన్నారు. కరోనా వైరస్​, వరుస వర్షాలతో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు తమవంతు సహాయం అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటామని తెరాస ఎన్నారై సెల్ సౌతాఫ్రికా విభాగం బాధ్యులు వీరన్న తెలిపారు.

అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో వినయ్​ భాస్కర్​ పర్యటించారు. పలు ప్రాంతాల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్​ స్థంభాలను వెంటనే తొలగించాలని విద్యుత్​ శాఖ అధికారులను ఆదేశించారు. 49వ డివిజన్​లో పరిధిలోని పలు కాలనీల్లో ఆయన పర్యటించారు. మొన్నటి భారీ వర్షాలకు నేలకొరిగిన చెట్లను తక్షణమే తొలగించాలని సూచించారు. కార్పోరేటర్లు, వార్డుల్లో ఉన్న సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వం పట్టణాల పరిశుభ్రతకు ప్రత్యేకంగా మిషన్​ మోడ్​ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు​ మాడిశెట్టి అరుణ శివశంకర్, కేశబోయిన అరుణ, తెరాస డివిజన్​ అధ్యక్షులు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :విఫలమవడానికి గల కారణాలపై కమిటీ వేశాం : జెన్‌కో సీఎండీ

ABOUT THE AUTHOR

...view details