రాష్ట్రంలో రోజురోజుకూ నిరుద్యోగ రేటు పెరిగిపోతోన్నా.. తెరాస ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటూ వరంగల్, ఖమ్మం, నల్గొండ భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో.. ఆయన పట్టభద్రులతో సమావేశం నిర్వహించారు.
కేసీఆర్ పూటకో మాట మాట్లాడుతూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ప్రేమేందర్ ఆరోపించారు. తెరాస అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమైందని వ్యాఖ్యానించారు.