తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం దీక్ష

కరోనా వ్యాధిని కూడా ఆరోగ్య శ్రీలో చేర్చి.. పేదవారికి సైతం చికిత్స ఉచితంగా  అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ బీసీ  సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్​  గౌడ్​ ఒక్కరోజు దీక్ష చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వైరస్​ నివారణ చర్యలు చేపట్టాలని, కరోనా చికిత్సకు ప్రత్యేక ఆస్పత్రులు నిర్మించాలని ఆయన డిమాండ్​ చేశారు.

By

Published : Jul 5, 2020, 9:43 PM IST

BC Sankshema Sangam Protest For Corona Treatment
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం దీక్ష

కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వరంగల్​ పట్టణ జిల్లా కాజీపేట వైష్ణవి గ్రాండ్​​లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో దీక్ష చేపట్టారు. బడా నాయకులకు కరోనా సోకితే కార్పోరేట్​ ఆస్పత్రిలో.. పేదలకు మాత్రం ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయించడం ప్రభుత్వానికి సబబేనా అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​ గౌడ్​ ప్రశ్నించారు.

కరోనా చికిత్స కోసం ప్రత్యేకంగా రాష్ట్ర రాజధానిలో 50వేల పడకలతో, జిల్లా కేంద్రాల్లో ఐదువేల పడకలతో ఆస్పత్రులు నిర్మించాలని ఆయన డిమాండ్​ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు మానుకొని వైరస్​ నిర్మూలనకోసం పనిచేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వరంగల్​ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఇంచార్జి వేణుగోపాల్​ గౌడ్​, ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:విదేశీ యాప్​లకు ప్రత్యామ్నాయంగా 'ఎలిమెంట్స్'

ABOUT THE AUTHOR

...view details