తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​ మేయర్​ పీఠమే లక్ష్యం: బండి సంజయ్ - warangal district latest news

రాష్ట్రంలో భాజపాకు ఆదరణ పెరుగుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పేర్కొన్నారు. సమష్టిగా కృషి చేసి గ్రేటర్​ వరంగల్​ ఎన్నికల్లో విజయం సాధించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. హన్మకొండలో నిర్వహించిన గ్రేటర్ వరంగల్‌ పోలింగ్ బూత్ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర ఇంఛార్జీ తరుణ్‌ చుగ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.

bandi sanjay participated in a meeting at hanmakonda in warangal
వరంగల్​ మేయర్​ పీఠం కైవసం చేసుకోవాలి: బండి సంజయ్

By

Published : Jan 9, 2021, 9:42 PM IST

రాబోవు గ్రేటర్ వరంగల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. వరంగల్‌ అర్బన్ జిల్లా హన్మకొండలో గ్రేటర్ వరంగల్‌ పోలింగ్ బూత్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంఛార్జీ తరుణ్‌ చుగ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌, ఇతర నేతలు హాజరయ్యారు.

రాష్ట్రంలో భాజపాకు ఆదరణ బాగా పెరిగిందని.. దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఎన్నికలే అందుకు నిదర్శనమని బండి సంజయ్​ పేర్కొన్నారు. ప్రణాళిక బద్ధంగా పని చేస్తూ.. వరంగల్‌ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఇదీ చూడండి: 'సంక్రాంతి తర్వాత ప్రతి గ్రామంలో రైతులతో ముఖాముఖి'

ABOUT THE AUTHOR

...view details