తెలంగాణ

telangana

ETV Bharat / state

పటిష్ఠ బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సుల తరలింపు

వరంగల్ అర్బన్ జిల్లాలోని నిన్న జరిగిన ప్రాదేశిక ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సులను పటిష్ఠ బందోబస్తు మధ్య ప్రభుత్వ గురుకుల పాఠశాలలకు తరలించారు.

By

Published : May 11, 2019, 9:38 AM IST

బ్యాలెట్ బాక్సుల తరలింపు

వరంగల్ అర్బన్ జిల్లాలోని ధర్మసాగర్, వేలేరు, ఐనవోలు మండలాల్లో 3 జెడ్పీటీసీ... 31 ఎంపీటీసీ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిసిన అనంతరం పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సులను కాజీపేట్ మండలం మడికొండలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్​ల వద్దకు తరలించారు. నిన్న రాత్రి 11 గంటల సమయానికి బ్యాలెట్ బాక్సులు ఉన్న వాహనాలు పాఠశాలకు చేరుకున్నాయి. ధర్మసాగర్, ఐనవోలు మండలాల ఎంపీడీవోలు బ్యాలెట్ బాక్స్​ల వెంట వచ్చారు. కాజీపేట ఏసీపీ నరసింహారావు స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు.

బ్యాలెట్ బాక్సుల తరలింపు

ABOUT THE AUTHOR

...view details