వరంగల్ అర్బన్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. పేదల జీవితంలో వెలుగు నింపడమే తెరాస లక్ష్యమని ఎమ్మెల్యే వెల్లడించారు.