తెలంగాణ

telangana

ETV Bharat / state

నిలిచిపోయిన రైళ్ల ప్రయాణికులకు ప్రత్యామ్నాయాలు

కర్నూల్​ నుంచి కాచిగూడ మధ్య నడిచే రైళ్ల రాకపోకలు నిలిచిపోవటం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే స్టేషన్​లలో కిక్కిరిసిపోయిన ప్రయాణికులకు ప్రత్యామ్నాయం చేసేందుకు అధికారులు యత్నిస్తున్నారు.

Alternatives for passengers of stalled trains

By

Published : Oct 9, 2019, 9:19 PM IST

కర్నూల్​- కాచిగూడ మధ్య రాళ్ల రాకపోకలు నిలిపోయి ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు అధికారులు ప్రత్యామ్నాయాలు చేస్తున్నారు. మన్యంకొండ స్టేషన్ సమీపంలో పట్టాలపై ఒకవైపు ఒరిగి పడిపోయిన రైల్​ ఇంజిన్ భోగిని తొలగించే వరకు రైళ్ల రాకపోకలు జరిగే అవకాశం లేకపోవటం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంత మంది దగ్గర్లో ఉన్న బస్టాండ్​లకు ప్రయాణమవుతున్నారు.

మహబూబ్​నగర్ జిల్లా మన్యంకొండ రైల్వేస్టేషన్ సమీపంలో ట్రాక్ మరమ్మతులు చేసే యంత్రం ఇంజిన్ పట్టా తప్పింది. ఈ ఘటనతో కర్నూల్ నుంచి కాచిగూడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సాయంత్రం ఐదు గంటలకు కర్నూల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన తుంగభద్ర ఇంటర్సిటీ ఎక్స్​ప్రెస్​ను దేవరకద్ర రైల్వేస్టేషన్​లో నిలిపివేశారు. అంతకు ముందు వచ్చిన గూడ్స్ రైళ్లను మరో ట్రాక్​పై నిలిపేశారు.

నిలిచిపోయిన రైళ్ల ప్రయాణికులకు ప్రత్యామ్నాయాలు

ఇదీ చూడండి : రెండ్రోజుల కస్టడీకి ఈఎస్​ఐ నిందితులు

ABOUT THE AUTHOR

...view details