తెలంగాణ

telangana

By

Published : Nov 11, 2019, 5:58 PM IST

ETV Bharat / state

కడిపికొండ మైనారిటీ రెసిడెన్షియల్​ స్కూళ్లో అబుల్​ కలాం జయంతి వేడుకలు

వరంగల్​ అర్బన్​ జిల్లా కడిపికొండ మైనారిటీ రెసిడెన్షియల్​ పాఠశాలలో     దేశ మొదటి విద్యా శాఖ మంత్రి  అబుల్ కలాం ఆజాద్ 131వ జయంతి వేడుకలు  నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరూరి రమేష్​ హాజరై రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు.

కడిపికొండ మైనారిటీ రెసిడెన్షియల్​ స్కూళ్లో అబుల్​ కలాం జయంతి వేడుకలు

దేశ మొదటి విద్యాశాఖ మంత్రి అబుల్​ కలాం ఆజాద్​ సేవలు మరువలేనివని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన ఆజాద్​ 131 జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పేద, మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 204 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు, విద్యార్థులకు మెరుగైన వసతి, భోజన సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు.

కడిపికొండ మైనారిటీ రెసిడెన్షియల్​ స్కూళ్లో అబుల్​ కలాం జయంతి వేడుకలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details