వరంగల్ ఎంజీఎం ప్రాంతంలో... 18 ఏళ్లుగా టీకొట్టు నడుపుతున్న మహమూద్ పాషాకు చానాళ్ల క్రితం వరకు చాయ్ బండి కూడా లేదు. కేవలం ఓ చిన్న టేబుల్పైనే వ్యాపారం చేసుకునేవాడు. అయితే మెప్మా ద్వారా చిరువ్యాపారులకు రుణం వస్తుందను తెలుసుకుని దానికి అప్లై చేసుకున్నాడు. రూ.10 వేల లోన్ వచ్చింది. లాక్డౌన్ సమయంలో కూడా ఒక్క వాయిదా ఆపకుండా చెల్లించాడు. ఇంతవరకు సాధారణంగానే ఉంది. ఆ తర్వాత కొన్ని రోజులకు అతనికో ఫోన్ వచ్చింది. ఆ తర్వాత అతని ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇంతకీ ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది. అతని ఆనందానికి కారణం ఏమిటంటే..
టీ బండి నడిపించే పాషాకు దిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. జులై మొదటి వారంలో ప్రధాని మోదీ మీతో మాట్లాడతారు.. అందుకు సిద్ధంగా ఉండండని సమాచారం ఇచ్చారు. ఈ వార్త విన్న పాషా ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. దేశ ప్రధాని తనతో మాట్లాడే సమయం కోసం ఆతృతగా వేచి చూస్తున్నాడు. పాషా తండ్రి అఫ్జల్ పాషా నలభై ఏళ్ల నుంచి ఇదే ప్రాంతంలో టీకొట్టు నడుపుతుండగా.... మహమూద్ పాషా కూడా దీనినే జీవనోపాధిగా ఎంచుకున్నాడు. చాయ్ అమ్ముతూనే ఇంటర్ వరకూ చదివాడు. ఫోన్ పే, గుగూల్ పే ద్వారా ఎక్కువ ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. టీ కొట్టు నడిపే తనతో ప్రధాని మాట్లడగలిగే ఛాన్స్ రావడం... తన అదృష్టమని పాషా చెబుతున్నాడు.
చాలా సంతోషంగా ఉంది..