తెలంగాణ

telangana

By

Published : Jul 1, 2020, 5:10 PM IST

ETV Bharat / state

భద్రకాళి ఆలయంలో 9వ రోజుకు చేరిన శాకంబరి ఉత్సవాలు

వరంగల్​లోని భద్రకాళి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు నిలిపివేసినట్లు అర్చకులు తెలిపారు.

9th day shakambari utsav at bhadrakali temple in warangal district
భద్రకాళి ఆలయంలో 9వ రోజుకు శాకంబరి ఉత్సవాలు

ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం వివిధ రకాల పుష్పాలతో పూజలు చేసి అనంతరం నీమాత్రా క్రమంలో అలంకరించారు.

కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేయడం పూర్తిగా నిలిపివేశామని ఆలయ అర్చకులు వివరించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ముందుగా థర్మల్​ స్క్రీనింగ్​ చేశాక.. మాస్కులుంటేనే లోనికి అనుమతిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details