తెలంగాణ

telangana

By

Published : Apr 10, 2021, 3:18 PM IST

ETV Bharat / state

'జాతీయ లోక్​ అదాలత్​ను సద్వినియోగం చేసుకోండి'

జాతీయ లోక్​ అదాలత్​ను సద్వినియోగం చేసుకోవాలని.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇంఛార్జీ ఛైర్మన్​ జయకుమార్​ కోరారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 26 బెంచ్​లు ఏర్పాటుచేసినట్లు చెప్పారు.

lok adalat at warangal urban district
హన్మకొండలో జాతీయ లోక్​ అదాలత్​

పెండింగ్​లో ఉన్న కేసుల పరిష్కారం కోసం వరంగల్ అర్బన్ జిల్లాలో జాతీయ లోక్​ అదాలత్ నిర్వహించారు. హన్మకొండలోని జిల్లా కోర్టులో జాతీయ లోక్​ అదాలత్​ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇంఛార్జీ ఛైర్మన్​ జయకుమార్ ప్రారంభించారు.

క్రిమినల్, సివిల్, ఆస్తి తగాదా వంటి కేసులను పరిష్కరిస్తున్నామని ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జయకుమార్ కోరారు. సమస్యలను అక్కడిక్కడే పరిష్కరిస్తామన్నారు. జాతీయ లోక్​ అదాలత్​కు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా 26 బెంచ్​లు ఏర్పాటుచేశారు.

ఇవీచూడండి:ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కొవిడ్ చికిత్సకు సర్కారు నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details