నిత్యం మద్యం సేవించి భార్యను వేధిస్తున్న భర్తపై తన తల్లితో కలిసి కర్రలతో దాడి చేసి గాయపరిచిన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లాలో చోటు చేసుకుంది. నల్లబెల్లి మండలం ఎర్రచెరువు తండాకు చెందిన లావుడ్య బాల్సింగ్ నిత్యం తాగొస్తూ తన భార్యను వేధింపులకు గురిచేసేవాడు.
తల్లితో కలిసి భర్తపై కర్రలతో దాడి చేసిన భార్య - Wife assaulting alcoholic husband
భర్త నిత్యం మద్యం సేవించేవాడు.. ఇంటికొచ్చాక భార్యను వేధించేవాడు. కొన్ని రోజులు భార్య ఓపిక పట్టింది.. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. చివరకు తన తల్లితో కలిసి భర్తపై కర్రలతో దాడి చేసింది. ఈ ఘటన వరంగల్ గ్రామీణ జిల్లాలో జరిగింది.
![తల్లితో కలిసి భర్తపై కర్రలతో దాడి చేసిన భార్య Wife attacks husband with sticks along with mother at erracheruvu thanda warangal rural](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8131708-329-8131708-1595427805552.jpg)
తల్లితో కలిసి భర్తపై కర్రలతో దాడి చేసిన భార్య
ఈ క్రమంలో విసుగు చెందిన భార్య రమ్య తన తల్లితో కలిసి కర్రలతో దాడి చేసింది. సమాచారం తెలుసుకున్న నల్లబెల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాల్సింగ్ను ఆస్పత్రికి తరలించారు.
తల్లితో కలిసి భర్తపై కర్రలతో దాడి చేసిన భార్య
ఇదీ చూడండి :రైలింజన్ ఢీకొని.. ముగ్గురు రైల్వే ఉద్యోగులు మృతి