తెలంగాణ

telangana

ETV Bharat / state

నీటి వృథాను అరికడదాం.. భావితరాలను కాపాడదాం

నీరు ప్రాణికోటికి జీవనాధారం. జల వనరులను సంరక్షించాలంటూ వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో బాలవికాస స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు పాల్గొని నీటి పొదుపుపై సూచనలు చేశారు.

By

Published : Mar 23, 2019, 6:31 PM IST

నీటి దినోత్సవం

నీటి సంరక్షణపై అవగాహన కల్పిస్తున్న చిన్నారులు, సంస్థ ప్రతినిధులు
ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాల బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జలసంరక్షణ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పాల్గొని చిన్నారులతో నీటి పొదుపుపై ప్రతిజ్ఞ చేయించారు. నీరు వృథా చేయకుండా వనరులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని వెల్లడించారు. పర్యావరణాన్ని పరిరక్షించి భూగర్భ జల వనరులు పెరిగేలా చూడాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details