తెలంగాణ

telangana

ETV Bharat / state

జాతీయ పక్షి ప్రాణాలు కాపాడిన గ్రామస్థులు - వరంగల్​ గ్రామీణ జిల్లా సమాచారం

అనారోగ్యంతో ఉన్న ఓ నెమలిని కాపాడి వరంగల్ గ్రామీణ జిల్లా మైలారం గ్రామ ప్రజలు మానవత్వం చాటుకున్నారు. ధాన్యం గింజలు, నీరు అందించి దాని ప్రాణాలను కాపాడారు.

villagers-saved-the-national-bird-lives-in-warangal-rural-district
జాతీయ పక్షి ప్రాణాలు కాపాడిన గ్రామస్థులు

By

Published : Jan 12, 2021, 3:29 PM IST

నిస్సహాయ స్థితిలో ఉన్న జాతీయ పక్షి ప్రాణాలు కాపాడి మూగజీవాలపై తమకు ఉన్న ప్రేమను వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామ ప్రజలు ప్రదర్శించారు. అనంతరం పోలీసులకు ఆ నెమలిని అప్పగించారు.

జిల్లాలోని మైలారం గ్రామంలో అనారోగ్యంతో ఎగరలేని స్థితిలో ఉన్న నెమలిని గ్రామస్థులు చూశారు. వెంటనే దాన్ని చేరదీసి ధాన్యం గింజలు, నీరు అందించి ప్రాణాలు కాపాడారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్​కు సమాచారం అందించారు. త్వరితగతిన స్పందించిన ఎస్సై డాక్టర్​ను సంప్రదించి దానికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం గ్రామస్థులతో కలిసి అటవీ శాఖ అధికారులకు నెమలిని అప్పగించారు.

ఇదీ చదవండి:తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శం: సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details