తెలంగాణ

telangana

'జయశంకర్​ సార్​... కేసీఆర్​ కలలోకి రండి'

By

Published : Nov 24, 2019, 2:52 PM IST

ఎటువంటి డిమాండ్లు లేకుండా విధులకు హాజరవుతామన్నా.. సీఎం కేసీఆర్​ కనికరం చూపడంలేదని వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాల ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

పరకాల డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ఆందోళన

పరకాల డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ఆందోళన

వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాల డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. విధులకు హాజరవుతామన్నా.. ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు.

ప్రొఫెసర్​ జయశంకర్​ సీఎం కేసీఆర్​ కలలోకి వచ్చి తమ బాధలు తీర్చేలా చేయాలని కోరుకున్నారు. డిపో ఎదుట జయశంకర్​ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

తెలంగాణ ఉద్యమానికి సహకరించిన ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్​కు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details