'పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి' - The services of sanitation workers are unforgettable
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల కోసం పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది, పోలీసుల సేవలు మరువలేనివని వర్ధన్నపేట మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ కోమాండ్ల ఎలెందర్ రెడ్డి అన్నారు.
పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి
వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో వైస్ ఛైర్మన్ కోమాండ్ల ఎలెందర్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికులకు శాలువతో సన్మానించారు. అనంతరం వారికి నిత్యావసర సరకులు, పండ్లు పంపిణీ చేశారు. ఇవాళ తన కుమారుడి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఆంగోతు అరుణ, కమిషనర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.