తెలంగాణ

telangana

ETV Bharat / state

నకిలీ విత్తనాలు అమ్మితే క్రిమినల్‌ కేసులు

రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే డీలర్లపై కేసులు నమోదు చేస్తామని శాయంపేట ఎస్సై హెచ్చరించారు. మండలంలోని విత్తనాలు, ఎరువుల దుకాణా డీలర్లతో సమావేశమై.. పలు సూచనలు చేశారు. నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై పీడీ చట్టం ప్రయోగిస్తామన్నారు.

By

Published : May 20, 2020, 7:51 PM IST

Selling counterfeit seeds is criminal cases
నకిలీ విత్తనాలు అమ్మితే క్రిమినల్‌ కేసులు

వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలంలోని విత్తనాలు, ఎరువుల దుకాణా డీలర్లతో ఎస్సై సమావేశమయ్యారు. ఖరీఫ్ కాలంలో రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి పొందిన కంపెనీ డీలర్ నుంచి మాత్రమే సరకులు తీసుకోవాలని సూచించారు.

రైతులు కొన్న సరకులకు తప్పనిసరిగా రసీదులు పొందాలని పోలీసులు పేర్కొన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించినట్లు సమాచారం అందితే.. ఆ దుకాణాదారులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామన్నారు.

ఇదీ చూడండి:పెట్రోల్​ బంక్​ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details