తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు వినియోగించుకోవాలి' - పరకాలలో ఉచిత వైద్య శిబిరం

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య సేవలను ప్రజలంతా వినియోగించుకోవాలని పరకాల మున్సిపల్ ఛైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ తెలిపారు. వరంగల్​ రూరల్​ జిల్లా పరకాల జనరిక్ ఫార్మసీ వద్ద ఏర్పాటు చేసిన ఉచిత వైద్య సేవల శిబిరాన్ని ప్రారంభించారు.

red cross free medical camp at parkal in warangal rural district
'ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు వినియోగించుకోవాలి'

By

Published : Oct 13, 2020, 5:23 PM IST

కరోనా కారణంగా పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ రూరల్ జిల్లాలో ఉచిత వైద్య సేవలను ఏర్పాటు చేయడం అభినందనీయమని పరకాల మున్సిపల్​ ఛైర్​ పర్సన్​ అనిత రామకృష్ణ కొనియాడారు. పరకాలలోని జనరిక్ ఫార్మసీ వద్ద ఏర్పాటు చేసిన ఉచిత వైద్య సేవల శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.

ప్రజలంతా ఈసేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఐఆర్​సీఎస్​ జిల్లా కోశాధికారి డా.పోతాని రాజేశ్వరప్రసాద్, జిల్లా ఎంసీ మెంబర్ బండి సారంగపాణి, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు బొల్లే బిక్షపతి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ బొజ్జం రమేశ్, ఇంగిలి వీరేశ్​రావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'జీహెచ్​ఎంసీ చట్ట సవరణ బిల్లును స్వాగతిస్తున్నా'

ABOUT THE AUTHOR

...view details