తెలంగాణ

telangana

By

Published : Apr 16, 2020, 12:44 PM IST

ETV Bharat / state

200 మంది నిరుపేదలకు సాయం చేసిన ఎమ్మెల్యే

లాక్​డౌన్​ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడం వల్ల కూలీలకు సాయం అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. వరంగల్ పట్టణ జిల్లా వడ్డేపల్లిలో 200 మంది నిరుపేదలకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్​భాస్కర్ సరకులను పంపిణీ చేశారు.

MLAs helps 200 people distributed goods at waddepally
200 మంది నిరుపేదలకు సాయం చేసిన ఎమ్మెల్యే

వరంగల్ పట్టణ జిల్లా వడ్డేపల్లిలో 200 మంది నిరుపేదలు, ఆశా కార్యకర్తలకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్​భాస్కర్ సరకులను అందజేశారు. నెల రోజులకు సరిపడా నిత్యావసరాలను పంపిణీ చేశారు.

అందరం కలిసికట్టుగా నిరుపేదలకు అండగా ఉండాలని ఆయన కోరారు. అందరి సహకారంతోనే కరోనా వైరస్​ను కట్టడి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి :రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు

ABOUT THE AUTHOR

...view details