కరోనా బాధిత కుటుంబాలకు ప్రతీ ఒక్కరూ తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ సూచించారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు ఆయన సాయం చేశారు. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ వారి సహకారంతో ఒక్కో కుటుంబానికి 20 వేల రూపాయలను అందించారు.
ఆ కుటుంబాలకు రూ.20 వేల ఆర్థిక సాయం - ఎమ్మెల్యే అరూరి రమేష్ తాజా వార్తలు
వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు ఎమ్మెల్యే అరూరి రమేష్ సాయం చేశారు. 20 వేల రూపాయలను అందజేశారు.
![ఆ కుటుంబాలకు రూ.20 వేల ఆర్థిక సాయం mla aroori ramesh distributed 20 thousand rupees for a family](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-01:35:17:1622880317-tg-wgl-36-05-mla-distribution-donation-money-to-corona-patients-ab-ts10144-05062021130436-0506f-1622878476-517.jpg)
ప్రతీ కుటుంబానికి రూ.20 వేలు అందజేసిన ఎమ్మెల్యే
అలాగే వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి గతంలోనే కోటి రూపాయలు, మందులను అందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. కరోనా బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రతీ ఒక్కరు సాయం చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అలాగే కరోనా బాధితులకు అండగా నిలిచిన కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు.
ఇదీ చదవండి:Eatala Resignation: తెరాసతో తెగతెంపులు... నేడు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా