తెలంగాణ

telangana

సొంతూళ్లో కుటుంబసభ్యులతో ఎర్రబెల్లి దయాకర్​ షికారు

By

Published : Jul 20, 2020, 9:01 PM IST

ఎప్పుడూ ప్రజాసేవే కాదు కాదు అప్పుడప్పుడూ కుటుంబంతోనూ సరదాగా గడపాలి అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు కుటుంబసభ్యులతో కలిసి తన స్వగ్రామమైన వరంగల్​ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో విహరించారు. ఎన్ని కష్టసుఖాలు వచ్చినా పుట్టిన ఊరిని మరవొద్దంటూ మనవడు, మనవరాళ్లతో చెప్తూ ఊరంతా తిప్పి చూపించారు. తన అలనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

minister yerrabelli tour to his native place in warangal rural parvatagiri
అలా సొంతూళ్లో షికారుకు పోయొద్దం: మంత్రి ఎర్రబెల్లి

కుటుంబసభ్యులతో క‌లిసి పంట పొలాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విహరించారు. వరంగల్ గ్రామీణ జిల్లా ప‌ర్వ‌త‌గిరిలోని తన నివాసంలో మన‌వ‌ళ్లు, మ‌న‌వరాళ్లతో క‌లిసి ఉత్సాహంగా గ‌డిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి స్వ‌యంగా త‌న పాత‌కాలం జీపుని న‌డుపుతూ, వెనుక ట్రాలీని అమ‌ర్చి కుటుంబ స‌భ్యుల‌ను అందులో కూర్చోబెట్టి ఊరంతా తిప్పి చూపించారు.

వారితో పూర్వపు రోజులను నెమరువేసుకుంటూ గ్రామస్థులతో మాటామంతి జరిపిన జరిపారు. ఎన్ని కోట్లు సంపాదించినా... ఎన్ని దేశాలు తిరిగిన ఉన్న ఊరు కన్నతల్లి లాంటిదని.. ఎన్ని కష్టాలు వచ్చిన మరవొద్దని ఆయన మనవడు, మవరాళ్లతో చెప్పారు. తన మనసులోని మాటలను మనోభావాలను వారితో పంచుకున్నారు.

ఇవీ చూడండి:కరోనా కన్నీళ్లు: చనిపోయిన ఆరురోజుల తర్వాత అంత్యక్రియలు

ABOUT THE AUTHOR

...view details