తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రి ఫోన్​ కాల్​: 80 మందిని కాపాడిన పోలీసులు - వరంగల్​ రూరల్ జిల్లా తాజా వార్తలు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇచ్చిన సమాచారం మేరకు.. వరదలో చిక్కుకున్న సుమారు 80మంది ప్రయాణికులను వర్ధన్నపేట పోలీసులు ప్రాణాలకు తెగించి కాపాడారు.

Minister Phone Call Saved 80 Members From Heavy Flood At Wardhannapet Warangal Rural District
మంత్రి ఫోన్​ కాల్​: 80 మందిని కాపాడిన పోలీసులు

By

Published : Aug 21, 2020, 12:26 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలోని కొనారెడ్డి చెరువు గండి వరద నీరు వరంగల్ - ఖమ్మం రహదారిపై ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో ప్రయాణికులతో ఉన్న 7 వాహనాలు ఆ వరదలో చిక్కుకుపోయాయి. సుమారు 5 గంటల పాటు ప్రయాణికులు అక్కడే నిలిచిపోయారు.

మంత్రి ఫోన్​ కాల్​: 80 మందిని కాపాడిన పోలీసులు

స్పందించిన మంత్రి ఎర్రబెల్లి

ప్రమాదాన్ని గ్రహించిన వారిలో కొందరు నేరుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే స్పందించిన మంత్రి వర్ధన్నపేట పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాదాపు 80 మంది ప్రయాణికులను రక్షించారు.

ఫోన్ కాల్​కు స్పందించిన మంత్రికి, ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసులకు చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపారు ప్రయాణికులు. సకాలంలో స్పందించిన పోలీసులను మంత్రి ఎర్రబెల్లి అభినందించారు.

ఇదీ చదవండి-రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు- రోజుకు 10 లక్షల దిశగా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details