తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​లో కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు: మంత్రి ఎర్రబెల్లి - మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు తాజా వార్తలు

వరంగల్​ గ్రామీణ జిల్లా పర్వతగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు టెలీకాన్ఫరెన్స్​ నిర్వహించారు. జిల్లాలో వైరస్​ వ్యాప్తిని అదుపుచేయడం, వ‌రంగ‌ల్ ఎంజీఎం సామ‌ర్థాన్ని మ‌రింత‌ పెంచ‌డం వంటి అంశాలపై చర్చించారు.

Minister Errabelli teleconference with officials and representatives of the people
అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి ఎర్రబెల్లి టెలీకాన్ఫరెన్స్​

By

Published : Jul 22, 2020, 7:26 AM IST

వరంగల్​ ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా వైద్యసేవలకు మరిన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు 5 ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించడానికి అనుమతులు రానున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పేర్కొన్నారు.

కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో ఈనెల 15న ఎంజీఎంలో కల్పించాల్సిన సౌకర్యాలపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​తో ఫోన్​లో చర్చించారు.

5 రోజుల తర్వాత ఎంజీఎం ఆసుపత్రిలో అదనపు సౌకర్యాల కల్పన చర్యలు మొదలవగా.. మంగళవారం సాయంత్రం వ‌రంగ‌ల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలోని త‌న క్యాంపు కార్యాల‌యం నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులతో మరోసారి టెలీకాన్ఫరెన్స్​ ద్వారా సమీక్షించారు.

త్వరలోనే అనుమతులు..

ఎంజీఎంలో ఉన్న 200 బెడ్లకు అదనంగా మరో 50 బెడ్లు పెంచామ‌ని మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడున్న వెంటిలేట‌ర్ల‌కు అద‌నంగా 15 వెంటిలేట‌ర్లు, 5 బైపాస్​ యంత్రాలు కూడా వచ్చినట్లు తెలిపారు. వైద్యులు, సిబ్బంది కరోనా బారిన పడకుండా 10 వేల ఎన్​-95 మాస్కులు, 4 వేల పీపీఈ కిట్లు తెప్పించినట్లు మంత్రి వివరించారు.

కరోనా చికిత్స అందించడానికి నగరంలోని జయ, మాక్స్​కేర్, అజరా, ఆదిత్య, అరవింద ముందుకు వచ్చాయన్న ఆయన.. త్వరలోనే వాటికి అనుమతులుల లభిస్తాయని తెలిపారు.

వరంగల్​ కేఎంసీ ఆవరణలో నిర్మాణంలో ఉన్న పీఎంఎస్​ఎస్​వై ఆసుపత్రిలో ఆక్సిజన్ అమర్చాలని మంత్రి ఈటలను కోరామని దయాకర్​రావు పేర్కొన్నారు.

200 పడకల సామర్థ్యం గల ఈ ఆసుపత్రిలో పూర్తిగా కరోనా వైద్యం అందించవచ్చని తెలిపారు. మరిన్ని ర్యాపిడ్​ యాంటీజెన్​ కిట్ల కోసం ఆదేశాలు జారీ చేశామన్నారు.

టెలీకాన్ఫరెన్స్​లో ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్​భాస్క‌ర్, రాజ్య‌స‌భ స‌భ్యులు బండా ప్ర‌కాశ్, వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ క‌రుణాక‌ర్​రెడ్డి, వ‌రంగ‌ల్ అర్బ‌న్ క‌లెక్ట‌ర్ రాజీవ్​గాంధీ హ‌న్మంతు, సీపీ ప్ర‌మోద్​కుమార్, కేఎంసీ ప్రిన్సిపల్ డాక్ట‌ర్ సంధ్యారాణి, ఎంజీఎం సూప‌రింటెండెంట్ శ్రీ‌నివాస్, డీఎంహెచ్​వో ల‌లితాదేవి త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఇదీచూడండి: కరోనా చికిత్సపై శిక్షణ కోసం వైద్యులకు జాతీయ వేదిక

ABOUT THE AUTHOR

...view details