తెలంగాణ

telangana

ETV Bharat / state

గవిచర్ల బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి ఎర్రబెల్లి

వరంగల్​ గ్రామీణ జిల్లా గవిచర్ల ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు.. కలెక్టర్, సీపీతో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హమీ ఇచ్చారు.

By

Published : Oct 27, 2020, 10:41 PM IST

minister errabelli dayakararao assurance to gavicharla car incident victims
మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ గ్రామీణ జిల్లా గవిచర్లలో జరిగిన ఘటన దురదృష్టకరమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కలెక్టర్, సీపీతో మాట్లాడిన మంత్రి.. క్షతగాత్రులకు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

రోడ్డు పక్కన ఉన్న ఓపెన్ బావుల పట్ల ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఉపయోగంలో లేని బావులు, బొందలు ఉంటే వెంటనే మూసివేసి.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి:అదుపుతప్పి బావిలో పడిన జీపు.. వాహనంలో 15 మంది

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details