Errabelli meet Rakesh family: సికింద్రాబాద్ అల్లర్లలో చనిపోయిన రాకేశ్ కుటుంబాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి పరామర్శించారు. వరంగల్ జిల్లా ఖానాపురం డబీర్పేటలో రాకేశ్ చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి నివాళులర్పించారు. అనంతరం రాకేష్ తండ్రి కుమారస్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల చెక్కు అందించారు. రాకేశ్ సోదరుడు రామరాజుకు నర్సంపేట ఆర్డీవో కార్యాలయంలో ఉద్యోగం ఇస్తున్నట్లు వెల్లడించారు. రామరాజుకు నియామక పత్రం మంత్రి చేతులమీదుగా అందజేశారు.
రాకేశ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. మనం పంజాబ్ రైతుల కోసం డబ్బులు ఇచ్చినం. దేశం కోసం చనిపోయిన యువకుడి కుటుంబాన్ని కేంద్రం ఆదుకోవాలి. దయచేసి ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దు. కేసీఆర్లాగా మీరు సాయం చేయండి. మీ పార్టీల తరఫున రాకేశ్ కుటుంబాన్ని ఆదుకోండి. త్వరలోనే ఆ కుటుంబాన్ని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్తాం. ఈ ఊరిని దత్తత తీసుకుంటా. సీసీ రోడ్ల కోసం రూ.50 లక్షలు ప్రకటిస్తున్నా.