తెలంగాణ

telangana

బైకుతో సహా వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి... పోలీసుల గాలింపు

By

Published : Aug 11, 2020, 7:48 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా కామారం గ్రామశివారులోని వాగుపై నుంచి రాజేశ్వరరావు అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. వాగులో కొట్టుకుపోయారు. అతని కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు.

man crossing stream flow went missing at kamaram
కామారం వద్ద బైకుపై వాగు దాటుతున్న వ్యక్తి గల్లంతు

వరంగల్​ గ్రామీణ జిల్లా ఆత్మకూరు మండలం కామారం గ్రామ శివారులోని వాగు వద్ద వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ద్విచక్రవాహనంపై వాగు దాటుతుండగా చౌలపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వర్​రావు అనే వ్యక్తి వాగులో గల్లంతయ్యారు.

అక్కడే ఉన్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమివ్వగా.. వారు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. రాజేశ్వర్​రావు కోసం వరదనీటిలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు. బాధితుడు.. సొంత పనిపై ఆత్మకూరుకు వచ్చి వెళ్తుండగా ఈ ఘోరం జరిగిందని.. ఇంతవరకు అతని జాడ దొరకలేదని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:హైదరాబాద్​కు 200 టన్నుల అమోనియం నైట్రేట్​!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details