వరంగల్ గ్రామీణ జిల్లా ఆత్మకూరు మండలం కామారం గ్రామ శివారులోని వాగు వద్ద వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ద్విచక్రవాహనంపై వాగు దాటుతుండగా చౌలపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వర్రావు అనే వ్యక్తి వాగులో గల్లంతయ్యారు.
బైకుతో సహా వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి... పోలీసుల గాలింపు
వరంగల్ గ్రామీణ జిల్లా కామారం గ్రామశివారులోని వాగుపై నుంచి రాజేశ్వరరావు అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. వాగులో కొట్టుకుపోయారు. అతని కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు.
కామారం వద్ద బైకుపై వాగు దాటుతున్న వ్యక్తి గల్లంతు
అక్కడే ఉన్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమివ్వగా.. వారు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. రాజేశ్వర్రావు కోసం వరదనీటిలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు. బాధితుడు.. సొంత పనిపై ఆత్మకూరుకు వచ్చి వెళ్తుండగా ఈ ఘోరం జరిగిందని.. ఇంతవరకు అతని జాడ దొరకలేదని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:హైదరాబాద్కు 200 టన్నుల అమోనియం నైట్రేట్!