వరంగల్ గ్రామీణ జిల్లా కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి వారి జాతర ఘనంగా ప్రారంభమైంది. మార్చి 1న అధ్యయనోత్సవాలు ప్రారంభం కాగా.. 5న స్వామివారికి కల్యాణం నిర్వహించారు.
వైభవంగా ప్రారంభమైన కొమ్మాల నారసింహుని జాతర
వరంగల్ గ్రామీణ జిల్లా కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 1న అధ్యయనోత్సవాలు ఆరంభం కాగా.. ఇవాళ స్వామివారి జాతర కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.
వైభవంగా ప్రారంభమైన కొమ్మాల నారసింహుని జాతర
జాతరలో భాగంగా ఇవాళ శకటమహోత్సవాన్ని నిర్వహించారు. ఈనెల 13న స్వామివారికి రథోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు స్పష్టం చేశారు. జాతరకు ఐదు నుంచి ఆరు లక్షల మంది భక్తులు వస్తారని.. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండిః'మారుతీరావు ఎందుకు చనిపోయినట్లు..? ఆ లేఖ ఎవరిది?'