తెలంగాణ

telangana

By

Published : Apr 24, 2019, 9:57 PM IST

ETV Bharat / state

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యానని ఓ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

చికిత్స పొందుతున్న సింధు

వరంగల్ గ్రామీణ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన సింధు ఇంటర్మీడియట్ పరీక్షలు ఫెయిల్ కావడం వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లిదండ్రులు కూలి పనుల కోసం బయటకి వెళ్లిన సమయంలో పురుగుల మందు తాగింది. మొదటి సంవత్సరంలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తానని ఆశతో ఉన్న సింధు.. ఒక సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. బాధితురాలు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సింధు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై శాయంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చికిత్స పొందుతున్న సింధు

ABOUT THE AUTHOR

...view details