భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించింది. జోరు వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా తడిసిముద్దయింది. వరంగల్, హన్మకొండ, కాజీపేట, మడికొండ, ధర్మసాగర్, వేలేరు మండలాల్లో ఏకధాటి వర్షం పడింది.
గ్రామీణ జిల్లాలోనూ ఎడతెరిపి లేని వర్షం
వరంగల్ గ్రామీణ జిల్లాలోని పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట మండలాల్లోనూ నిరంతరంగా వాన కురుస్తోంది. ఖానాపూరం మండలంలో పాకాల సరస్సు 19 అడుగులకు చేరింది. మహబూబూబాద్ జిల్లా గార్ల మండలంలో పాకాల వాగు ఉద్ధృతికి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు, భూపాలపల్లి జిల్లాలోనూ ముసురు పట్టింది. లక్నవరం, పాకాల, రామప్ప చెరువులు నిండుకుండల్లా మారాయి. భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో మోరంచ వాగు పొంగడంతో వెల్తుర్లపల్లి, అప్పయ్యపల్లి, బంగ్లపల్లి, గుర్రంపేట, నగరంపల్లి, కొండపల్లి, కొండాపూర్, సీతారాంపురం తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాకాల సరస్సుకు వరద నీరు భారీగా చేరింది. వర్ధన్నపేట ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో చెక్ డ్యామ్లు అలుగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆకేరు వాగు డ్రోన్ దృశ్యాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ నయాగరాగా పేరొందిన బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది.
జయశంకర్ భూపాలపల్లి గణపురం మండలంలో మోరంచ వాగు పొంగి వ్రవహిస్తుండడంతో... వెల్తుర్లపల్లి, అప్పయ్యపల్లి, బంగ్లపల్లి, గుర్రంపేట, నగరంపల్లి, కొండపల్లి, కొండాపూర్, సీతారాంపురం తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
నిండుకుండలా భద్రాకాళి జలాశయం