వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలంలోని ఊకల్ గ్రామంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ శివారులోని వైశ్యులకు సంబంధించిన 8 ఎకరాల స్థలంలో మొక్కలు నాటారు.
నియోజకవర్గ పరిధిలోని వాగులు, చెరువులు, కుంటల పక్కన విరివిగా మొక్కలు నాటాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. హరితహారం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో జరుగుతోందన్నారు. భవిష్యత్ తరాల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.