వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం సీతారాంపురంలో ఆకుల సమ్మయ్య(58) అనే వ్యక్తి తాటి చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. వెంటనే గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఎక్కువ ఎత్తునుంచి పడటం వల్ల వెన్నుముక తీవ్రంగా దెబ్బతిని మృతి చెందినట్టు వైద్యులు పేర్కొన్నారు.
తాటి చెట్టుపై నుంచి జారి పడి గీతకార్మికుడు మృతి
వారు చెట్లు ఎక్కనిదే కుటుంబం గడవదు. చెట్లే వారికి ఉపాధి. కానీ ప్రమాదవశాత్తు జారి పడితే అంతే ఆ కుటంబంలో ఇక విషాదమే. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లాలో జరిగింది.
తాటి చెట్టుపై నుంచి జారీ పడి గీతకార్మికుడు మృతి