తెలంగాణ

telangana

By

Published : May 11, 2021, 10:27 AM IST

ETV Bharat / state

ఎకో ఫ్రెండ్లీ పెన్ను.. పర్యావరణానికి దన్ను

పర్యావరణ సమస్యలకు చెక్‌ పెట్టడంలో భాగంగా.. వరంగల్‌ గ్రామీణ జిల్లాకు చెందిన ఓ యువకుడు సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. మొక్కజొన్న పొట్టు నుంచి పెన్నులు తయారు చేసి.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. చూడ ముచ్చటగా ఉన్న.. ఈ ఎకో ఫ్రెండ్లీ పెన్నుల వాడకం వల్ల ప్లాస్టిక్ వినియోగం తగ్గుతుందని అంటున్నాడు ఈ యంగ్ ఇన్నోవేటర్.

eco friendly pens
eco friendly pens

ప్లాస్టిక్‌ విచ్చలవిడి వినియోగంతో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోంది. దీంతో కాలుష్య నియంత్రణకు తనవంతు ప్రయత్నంగా ముప్పారపు రాజు చొప్పబెండు పెన్నుల తయారీకి పూనుకొన్నారు. ఈయనది వరంగల్‌ గ్రామీణ జిల్లా దుగ్గొండి మండలం గోపాలపురం. మొక్కజొన్న చొప్పలను సేకరించి వాటిలో రీఫిల్‌లను అమర్చుతూ ఈ పెన్నులకు రూపమిస్తున్నారు. వరంగల్‌ నగరపాలిక కమిషనర్‌ పమేలా సత్పతి.. ఈ పెన్నులు బాగున్నాయంటూ ట్విటర్‌ వేదికగా కితాబిచ్చారు. ప్లాస్టిక్‌ పెన్నులకు బదులు వీటిని వినియోగిస్తే పర్యావరణానికి కొంతైనా మేలుచేసిన వారమవుతామంటారు రాజు.

ABOUT THE AUTHOR

...view details