కరోనా నేపథ్యంలో జరుగుతున్న లాక్డౌన్ వల్ల పూటగడవని నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు అందిస్తూ వరంగల్ రూరల్ జిల్లాలోని ఇల్లందు గ్రామ ఉద్యోగస్థులు ఆదర్శనంగా నిలుస్తున్నారు. ఈ కార్యక్రమానికి వర్ధన్నపేట ఏసీపీ రమేశ్ ముఖ్య అతిథిగా హాజరై సరుకులను పంపిణీ చేశారు.
నిరుపేదలను ఆదరిస్తున్న ఉద్యోగస్థులు - వరంగల్ రూరల్ జిల్లా తాజా వార్త
లాక్డౌన్ నేపథ్యంలో పూటగడవని నిరుపేదలను ఆదరిస్తున్నారు ఆ గ్రామస్థులు. తమ వంతు సాయంగా బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేస్తూ వరంగల్ రూరల్ ఇల్లందు గ్రామ ఉద్యోగస్థులు మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
![నిరుపేదలను ఆదరిస్తున్న ఉద్యోగస్థులు Distribution of essential commodities of employees at warangal rural](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6614990-480-6614990-1585688652533.jpg)
నిరుపేదలను ఆదరిస్తున్న ఉద్యోగస్థులు
సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉద్యోగస్థులకు ఏసీపీ రమేశ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం ఇదే గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సైతం పేదలకు నిత్యవసర సరుకులు అందించారు.
నిరుపేదలను ఆదరిస్తున్న ఉద్యోగస్థులు
ఇదీ చూడండి:ఇవాళ ఒక్కరోజు 15 కరోనా పాజిటివ్ కేసులు