తెలంగాణ

telangana

ETV Bharat / state

కులసంఘం భవనం అమ్మేశారు?

ప్రభుత్వం కేటాయించిన గౌడ సంఘం భవనంను ఓ మాజీ సర్పంచ్​ మరో వ్యక్తికి అమ్మిన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా దమేర మండలం ల్యదల్లా గ్రామంలో చోటుచేసుకుంది.

By

Published : Jan 4, 2020, 12:53 PM IST

Did the caste group sell the building at parkal
కులసంఘం భవనం అమ్మేశారు?

కులసంఘానికి కేటాయించిన భవనాన్ని ఓ మాజీ సర్పంచ్​ మరో వ్యక్తికి అమ్మాడు. ఆ వ్యక్తి యాథేచ్చగా నల్లా కనెక్షన్​ సైతం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో కులస్తులు మా భవనం మాకు ఇప్పించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆ భవనాన్ని ప్రభుత్వం 2006లో లక్షా యాభై వేలతో నిర్మించింది. ప్రభుత్వ సొమ్ముతో కట్టిన కుల సంఘం భవనంను తాజాగా రూ. 3.20 లక్షలకు అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్​ వెంకన్న కాసోజుల రమణకు అమ్మాడు.

సదరు వ్యక్తి శిలాఫలకం తొలగించి కొత్త నిర్మాణాలను చేపట్టడం వల్ల సమస్య రచ్చకెక్కింది. ప్రభుత్వ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణానికి నోటీసులు ఇచ్చినట్లు చెప్పినా, అనుమతి లేని భవనానికి నల్ల కనెక్షన్ ఇచ్చిన కారోబర్​కు మెమో ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అక్రమాలను అరికట్టి దోషులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

కులసంఘం భవనం అమ్మేశారు?

ఇదీ చూడండి : మూడేళ్ల చిన్నారికి ఓటు హక్కు.. వయసు 35 ఏళ్లు

ABOUT THE AUTHOR

...view details