వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం సన్నూరులో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఐకేపీ సీసీలు దేవేంద్ర, స్వామిలు రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 'ఏ' గ్రేడ్ ధాన్యానికి రూ.1770 మద్దతు ధర లభిస్తుందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహిళ సంఘాల సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
ఐకేపీ ధాన్యం కొనుగొలు కేంద్రం ప్రారంభం - paddy
ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వరంగల్ గ్రామీణ జిల్లా సన్నూరులో ప్రారంభించారు. రైతులు ఈ కేంద్రాన్ని వినియోగించుకుని మద్దతు ధర పొందాలని ఐకేపీ సీసీలు తెలిపారు.

ఐకేపీ ధాన్యం కొనుగొలు కేంద్రం ప్రారంభం