తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపటి నుంచే భక్తులకు భద్రకాళీ అమ్మవారి దర్శనం - warangal Bhadrakali Temple is ready for visitation

రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 8 నుంచి దేవాలయాలు తెరుచుకోనున్నాయి. సుమారు రెండు నెలల తర్వాత ఓరుగల్లు భద్రకాళీ అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నందున ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.

devotes  are allowed in warangal Bhadrakali Temple from June eighth
రేపటి నుంచే భక్తులకు భద్రకాళీ అమ్మవారి దర్శనం

By

Published : Jun 7, 2020, 12:33 PM IST

ఓరుగల్లు భద్రకాళీ అమ్మవారు సుమారు రెండు నెలల తర్వాత భక్తులకు కనువిందు చేయనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆలయాలకు భక్తుల సందర్శన నిలిపివేసిన రాష్ట్ర సర్కార్ ఈ నెల 8నుంచి తెరిచేందుకు అనుమతించింది.

60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, 10 సంవత్సరాల లోపు పిల్లలకు ఆలయంలోనికి అనుమతి లేదని ఆలయ కార్యనిర్వహణాధికారిణి సునీత తెలిపారు. ఆలయంలో భక్తులు భౌతిక దూరం పాటించేలా అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. దేవస్థాన గేటు వద్ద భక్తులను శానిటైజ్ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తామని చెప్పారు.

ప్రస్తుతం ఆలయంలో ఎలాంటి ప్రత్యేక పూజలు జరగవని, అమ్మవారి దర్శనానికి మాత్రమే అనుమతుంటుందని సునీత తెలిపారు. సోమవారం నుంచి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా ఆలయం తెరిచి ఉంటుందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details