తెలంగాణ

telangana

ETV Bharat / state

పల్లివేట కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్న భక్తులు - నర్సంపేటలో వైభవంగా పల్లివేట కార్యక్రమం

నర్సంపేట పట్టణంలోని శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో పల్లివేట కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మహిళల కోలాటాలు ఆకట్టుకున్నాయి. ఆ వేడుకను చూసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Devotees in large numbers participated in the Pallivetta program at narsampet
పల్లివేట కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్న భక్తులు

By

Published : Dec 9, 2020, 4:50 AM IST

పల్లివేట కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్న భక్తులు

వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలోని శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయంలో 20వ మండల పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

మంగళవారం ఆలయంలో స్వామివారికి ఘనంగా పల్లివేట కార్యక్రమాన్ని జరిపారు. డప్పు వాయిద్యాలతో కళాకారుల నృత్యాలతో ఆలయ ప్రాంగణం మారు మ్రోగింది. స్వామి వారిని ఆలయం నుంచి పల్లకిలో కిందకు తీసుకువచ్చి రథంపై పుర వీధుల్లో ఊరేగించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ మాధవ శంకర్​తోపాటు నర్సంపేట పట్టణ ప్రముఖులు, అయ్యప్ప భక్తులు, మహిళలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి :రూ.137 కోట్లు తీసుకుని.. రుణం ఎగవేత

ABOUT THE AUTHOR

...view details