గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 15వ డివిజన్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. నియోజకవర్గ పార్టీ ఇంఛార్జి వెంకట్రాం... కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్రావు తరఫున ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ... కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. అత్యధిక మెజార్టీతో ప్రవీణ్రావును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి: కాంగ్రెస్ - Telangana News Updates
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. 15వ డివిజన్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. తెరాస, భాజపాలకు ఓటుతోనే బుద్ది చెప్పాలని నియోజకవర్గ పార్టీ ఇంఛార్జి వెంకట్రాం అన్నారు.
![వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి: కాంగ్రెస్ congress campaign](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:25:19:1619517319-tg-wgl-44-27-congres-av-ts10074-27042021142618-2704f-1619513778-382.jpg)
congress campaign
తెలంగాణ వస్తే… ఉద్యోగాలు వస్తాయని మాయమాటలు చెప్పిన కేసీఆర్… వారి కుటుంబానికి మాత్రమే లబ్ధి చేరుకుందని ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసం తెరాస, భాజపాలు ఓట్లకు వస్తారని… వారికి తగిన బుద్ది చెప్పాలని సూచించారు. ఎక్కడ చూసినా అభివృద్ధి శూన్యమని వెల్లడించారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
ఇదీ చూడండి:పది రెట్లు ధర పెంచి కరోనా మందుల అమ్మకం..!