వరంగల్ గ్రామీణ జిల్లా దామెర మండలంలో కలెక్టర్ హరిత ఆకస్మిక తనిఖీ చేశారు. డంపింగ్ యార్డు, శ్మశానవాటిక నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని లేకపోతే సర్పంచ్, ఉపసర్పంచ్పై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరిత హెచ్చరించారు. దామెరతో పాటు ల్యాదళ్ల, సింగరాజుపల్లి గ్రామాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల కేంద్రం రహదారి వెంబడి హరితహారానికి తీస్తున్న గుంతలను, శ్మశానవాటికలు నిర్మిస్తున్న స్థలాన్ని ఆమె పరిశీలించారు.
మూడు గ్రామాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - collector haritha inspection three villages in warangal
వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత దామెర మండలంలోని పలు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. దామెర గ్రామంతో పాటు ల్యాదెళ్ల, సింగరాజుపల్లిలోని డంపింగ్ యార్డు, శ్మశానవాటిక నిర్మాణ పనులను పరిశీలించారు. పలు చోట్ల నిర్మాణ పనులు సరిగ్గా లేకపోవడంతో ఆయా గ్రామాల అధికారులపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.
మూడు గ్రామాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
గ్రామంలో రహదారి మధ్యలో డ్రైనేజీల నుంచి పొంగుతున్న మురుగునీటిని శుభ్రం చేయాలని సర్పంచ్కు సూచించారు. ల్యాదళ్లలో నర్సరీని పరిశీలించేందుకు కలెక్టర్ వెళ్లారు. అక్కడ దారిలో నీరు నిలిచిపోవడం, బురదమయంగా మారడం చూసి ఆమె అసహనం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేయబోతున్న హరితపార్కు స్థలం వివాదంలో ఉందని తెలుసుకున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం స్థలాన్ని అందజేయాలని తహశీల్దార్ను ఆదేశించారు.
ఇదీ చదవండి:ఆడుకున్న ఇంటిని కూల్చేశారు.. ఆడించిన నాన్నను చంపేశారు!