తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రామ స్వరాజ్యానికి మోదీ కృషి: ప్రదీప్​రావు - Bjp sankalp yatra at narsampet

వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో భాజపా ఆధ్వర్యంలో గాంధీజీ సంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర నాయకులు ప్రదీప్​రావు పాల్గొన్నారు.

నర్సంపేటలో భాజపా సంకల్ప యాత్ర

By

Published : Nov 3, 2019, 9:28 PM IST

గాంధీజీ సంకల్ప యాత్ర

గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ప్రధానమంత్రి మోదీ చేసి చూపిస్తున్నారని భాజపా రాష్ట్ర నాయకులు ప్రదీప్​రావు అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో గాంధీజీ సంకల్ప యాత్ర నిర్వహించారు. గ్రామాల్లో స్వచ్ఛత, మద్యనిషేధం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తూ.. గ్రామస్వరాజ్యం కోసం మోదీ కృషి చేస్తున్నారన్నారు. గాంధీజీ పేరుతో పార్టీ ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఆయన ఆశయాలను మాత్రం విస్మరించారని రేవూరి ప్రకాశ్​రెడ్డి ఆరోపించారు. సంకల్ప యాత్రలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్​తోపాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్​రెడ్డి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details