వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం పన్యానాయక్ తండాలో ఇంటి ముందు నిద్రిస్తున్న వృద్ధురాలి మెడలో నుంచి నాలుగున్నర తులాల బంగారు గొలుసును దొంగలు తెంపుకెళ్లారు. మహిళకు మెలకువ వచ్చి అడ్డుకోబోగా చితక బాదారు. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇంటి ముందు నిద్రిస్తుంటే ఎత్తుకెళ్లారు..
ఇంటి ముందు నిద్రిస్తున్న ఓ వృద్ధురాలి మెడలో నాలుగున్నర తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు దొంగలు. ఈ ఘటన వరంగల్ జిల్లా పన్యా నాయక్ తండాలో చోటు చేసుకుంది.
బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన దొంగలు