తెలంగాణ

telangana

ETV Bharat / state

కూతురి సాయంతో భర్త గొంతు కోసి చంపేసింది..

అనుమానంతో ఆ భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. వేధింపులు సహించలేక పోయిన భార్య... కూతురి సాయంతో భర్త గొంతు కోసి హత్య చేసిన ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : Jun 10, 2020, 5:20 PM IST

wife-murdered-her-husband-at-wanaparthy-district
భర్త గొంతు కోసి హత్య చేసిన భార్య

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పుల్యాతండాకు చెందిన మెగావత్​ బాల్యనాయక్, మన్నెమ్మ దంపతులు హైదరాబాద్​లో జీవనం కొనసాగించేవారు. లాక్​డౌన్ కారణంగా ఉపాధి లేక సొంత తండాకు వచ్చారు. ఈ క్రమంలో బాల్య నాయక్ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. నిత్యం వీరి మధ్య గొడవులు జరుగుతుండేవి.

విసుగు చెందిన మన్నెమ్మ కూతురు సాయంతో మంగళవారం రాత్రి నిద్రిస్తున్న భర్త గొంతును కత్తితో కోసి చంపేసింది. వనపర్తి డీఎస్పీ కిరణ్​కుమార్, కొత్తకోట సీఐ వై. మల్లికార్జున్​ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు.

ఇవీ చూడండి:పదో తరగతి విద్యార్థులను అప్​గ్రేడ్​ చేస్తూ జీవో

ABOUT THE AUTHOR

...view details